26 April 2007

శ్రీ సాయి లీలామృతము :: అధ్యాయము - 1 :: 05

"సరిగా చెప్పండి!" --"నేనెన్నడూ అబద్ధం చెప్పను."
అంటే సాయి -- నామ, రూప, కుల, మత, వయో భేదాలకు అతీతులు, సర్వవ్యాపీయైన ఆత్మయేనని స్పష్టమవుతుంది. ఆయన వయస్సు అపారమని తెల్పే ఆధారాలెన్నో వున్నాయి. అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ, కనీరు కారుస్తున్న భక్తునితో, "శిరిడీ లో నా అవతారమూర్థి నీకు లభిస్తారు. ఆయనను సేవించు. నీకే కొరతా వుండదు." అని చెప్పారు. సాయిబాబా గూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవమిచ్చారని మీరు చదువబోతారు. అంటే అక్కల్కోట స్వామియే సాయి అన్నమాట. ఈ యిద్దరూ సమకాలికులవడం ఒక అంతు బట్టని దైవలీల. అంటే ఆస్వామి వయస్సు, పుట్టుపూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతమన్నమాట. ఆ స్వామి వయస్సు వందలయేండ్లు. ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసిమ్హ సరస్వతియే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీ పాద శ్రీవల్లభులే;అంటే స్వయంగా సనాతనుడిన దత్తస్వామియే అన్నమాట. ఆయనెందరికో అటువంటి దివ్యదర్శనాలు యిచ్చారు.
అంతేగాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషీకేశ్ తపోవనము వెళ్ళినప్పుడు, అక్కడ అపారమైన వయస్సుగల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు, ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయస్సు గూడ అపారమేగదా!

అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్ కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారే అలా జన్మించాడనీ సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరునన్నారు. రామాయణ, భాగవత కాలంలో గూడ తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞానియని ఆయనయే ఒకసారు ఇలా సూచించారు. "నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగి పోవడం చూచి నేను ఆశ్చర్య పోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననమున్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంతమాత్రానికే ఈమే పొంగిపోతున్నదేమితి? అనుకొన్నాను."

శ్రీ సాయి లీలామృతము :: అధ్యాయము - 1 :: 04

"ఒకప్పుడు బాబా మసీదులో ధుని దగ్గర వున్న స్తంభాన్ని నాకు చూపి, దాని క్రిందనే ఒక గుహ వున్నదని, తామందులో నివసించామనీ - ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడూ బయటకు వచ్చేవారు గారనీ, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదనీ నాతో స్వయంగా చెప్పరు." బాబా మరొక్కప్పుడు సగుణమేరు నాయక్తో, "ఏమిటి, ఒకటి రెండు రోజుల ఉపవాసానికే తట్టుకోలేవా? నేను 12 సంలు కేవలం వేపాకు తిని జీవించాను" అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912 సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు, ఇలా చెప్పారు: "తామెన్నో కష్టాలకోర్చామని, నెలలల్ తరబడి ఆహారం లేకుండా వున్నామని, వేప మొన ఆకులు మాత్రమే తిన్నమనీ చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి, ఎముకలు గూడ నిలువజాలని స్థితి లో వున్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు" (ఖాపర్దే డైరీ)


II

ఈ బాలునికి 16 సంల లోపలే అంత గడ్డమెలా పెరిగింది? అసలు ఆయన వయస్సెంత? - ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ, తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగిలించలేదని, తనకు సాయిబాబ యిచ్చారనీ చెప్పాడు. అంతట కోర్టువారు సాయిబాబాను కోర్టుకు హాజరు గమ్మని సమన్ లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవడం వలన, భక్తులు పెట్టుకున్న అర్జీననుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు. దానిలో ముఖ్యాంశాలివి:
న్యాయవాది : మీ పేరేమి?బాబా : వీరంతా నన్ను సాయిబాబా అంటారు."మీ తండ్రి పేరు?" -- "అదీ సాయిబాబాయే""మీ గురువు పేరు?" --"వెంకూసా""మతం?" -- "కబీరు""కులం?" --"దైవం""మీ వయస్సు?" --"లక్షల సంవత్సరాలు"

25 April 2007

శ్రీ సాయి లీలామృతము :: అధ్యాయము - 1 :: 03

జొరబడి ఆ విగ్రహాలను విరగ్గొట్టాడు గూడ. వాటికి ఎలాంటి రక్షణ వుండేది గాదు. గ్రామ మధ్యంలో ఒక విఠలుడి ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామ దేవత ఖండోబా ఆలయమూ వున్నాయి.

శ్రీ సాయి 1854 ప్రాంతం లో ఒక రోజు ఆ గ్రామానికి వుత్తరాన వున్న ఒక వేప చెట్టు క్రింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూచిన వృద్ధురాలు (నానా చోప్దార్ తల్లి) ఇలా చెప్పింది : "ఈ బాలుడు మొదట వేపచెట్టు క్రింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతడి రూపము మనోహరముగా వుండేది. ఎప్పుడూ ఎవరింటికీ వెళ్ళకుండా ఆ చెట్టూ నీడనే వుండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు గాదు. రాత్రి సమయాలలో గూడా అతడు భయమెరుగడు. చూడడానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహా జ్ఞానియని సూచించేవి. అంత చిన్న వయస్సులో చలికి, వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్య పోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ అంతు పట్టనిది. ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా ? అని అందరూ అనుకునేవారు. ఒక సారి గ్రామ దేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ అతనిని "ఇతనిని కన్న పుణ్యాత్ములెవ్వరు? ఇతడూ యెకడి నుండి వచ్చాడు?" అని అడిగారు. ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి, ఆ చెట్టుకింద ఒక చోట త్రవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని క్రింద కొన్ని ఇటుకలూ కనిపించాయి. ఆ బండను తొలగిస్తే, దాని అడుగున భూగర్భము లోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న నాలుగు ప్రమిదలూ ఉన్నయి. అప్పుడు ఆ గణం, 'ఈ బాలుడిక్కడ 12 సంలు తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు, అది గురుస్థానమని, ఆ బండని తిరిగి మూసివేయాలనీ చెప్పి అలానే చేయించాడు. తరువాత గూడ ఒక సారి ఆ వేపచెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మత్తులు చేయిస్తుంటే, దాని క్రింద ఆ భూగృహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో గూడా బాబా అలానే చెప్పారు. తరువాత అక్కడ ఒకరోజున పిల్లలు ఆడుకొంటూ ఆ బండను తొలగించి చూచారు. అక్కడ భూమి లోకి మెట్లు, చాల పొడువుగాను, చీకటిగానూ ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాశారు:

24 April 2007

శ్రీ సాయి లీలామృతము :: అధ్యాయము - 1 :: 02

తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్నిప్రాంతాలనుండి వస్తుండేవారు. కాని వారిలో ఏ ఒక్కరూ ఆయన గురించి ఏమీ చెప్పలేక పోయారు. ఆయనతో చాలా కాలం ఉన్నవారు గూడా ఆయన గురించి ఏమీ చెప్పలేక పోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు గూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానేదైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. శిరిడీ లో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్త్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైనవారే తమ తల్లిదండ్రులు అని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరనీ ఆయన ఎలా తలుస్తారు?

ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపం లా వెల్గొందుతున్న శిరిడీలో, రాజభవనం వంటి సమాధి మందిరంలో, సింహాసనం పై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. . దేశం నలుమూలల నుండీ వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోను, క్రొత్త వస్త్రాలతో ప్రతి క్షణమూ సరిక్రొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతుంటారు. దీనికీ, నేటి శిరిడీ క్షేత్రానికీ ఎంతో చక్కని పోలిక ఉన్నది. కాని సుమారు నూటముప్పై సంల కిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి శిరిడి. అక్కడ 80 గడపలకు మించి వుండేవి కావు. దాదాపు ఇళ్ళన్నీ మట్టికట్టడాలే. ఒకటి రెండు గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడివి, పొలాలూ వుండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుఋఋఅపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు, పెద్దలు చోద్యంగా చూచేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె శిరిడీ. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలి నడకన దేశ సంచారము చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనో, లేక "తాకియా" లోనో బస చేసేవారు. ఆనాటి శిరిడీ లో ఈనాటి మన జీవితాలలో లాగా సరియైన వీధి గాని, వీధి దీపాలు గాని వుండేవి గావు. గ్రామంలో తలుపులు గూడ లేని మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు వుండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో

23 April 2007

శ్రీ సాయి లీలామృతము :: అధ్యాయము - 1 :: 01

ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ సాయి లీలామృతము
అధ్యాయము - 1
శ్రీ సాయి బాబా జీవితము
I



"మీరెవరు?" అని అడిగితే, "వటవృక్షము, మూలము, మూలానికి మూలము, మాది దత్తనగరము" అని చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి. ఆయనే ఒకసారి "అఖండ విశ్వమే మేము" అన్నారు. శ్రీ సాయి బాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరిద్దరి చరిత్రలూ దత్తావతారమనే బంగారు నాణానికి బొమ్మ-బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహెర్ బాబా కూడా, శ్రీ సాయి ఈ విశ్వమంతటికీ గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన శిరిడీ వంటి మారుమూల కుగ్రామం కాశీ, తిరుపతి వంటి మహా క్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే, శిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే గాని మాటలలో చెప్పలేనిది. మనకు ఇంటివద్ద ఏమి చేసినా శాంతించని మనస్సు శిరిడీ లో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరచి మహా శాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమ గమ్యమన్నది ఋషి వాక్యం.


శ్రీ సాయిబాబా శిరిడీ లో సుమారు 60 సంలు నివసించినప్పటికీ, ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ, అసలు ఆయన పేరేమో, ఊరేమోఊరేమో, తల్లిదండ్రులెవరో, కులగోత్రాలేమిటో ఎవరికీ